భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కమల్నాథ్ దేశ ప్రజల ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం భోపాల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు.
‘మేరా భారత్ కొవిడ్’ తరహా నినాదంతో పనిచేసే కాంగ్రెస్ పార్టీ ‘ఇండియన్ కరోనా’ అని ఆయన అభివర్ణించారు. కరోనా సంక్షోభ సమయంలో సోనియా గాంధీ, కమల్ నాథ్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో కరోనా కట్టడికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.