న్యూఢిల్లీ : ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును, అదనపు బరువును వదిలించుకునేందుకు(weight loss) జిమ్లో చెమటోడ్చటం నుంచి కసరత్తులు, డైట్ వంటి ఎన్నో పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. ఎంత చేసినా బరువు తగ్గడం లేదని మరికొందరు చింతిస్తుంటారు. అయితే గంటల కొద్దీ వర్కవుట్స్ చేసినా లంచ్, డిన్నర్లు ఇంట్లో వండిన ఆహారం కాదని, రెస్టారెంట్లను ఆశ్రయిస్తే ఫలితం ఉండదని మాజీ చెఫ్, రెస్టారెంట్ యజమాని మధు మీనన్ చెబుతున్నారు.
ఆధునిక జీవితంలో ఇంట్లో ఆహారం తయారుచేయడం తగ్గించి ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ ఇవ్వడం పెరుగుతోంది. మనం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం నిలిపివేయకుంటే బరువు తగ్గడం కష్టమని మధు మీనన్ అంటారు. రెస్టారెంట్స్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే బరువు తగ్గడం అసాధ్యమని తాను అలా ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకోవాలని వరుస ట్వీట్లలో ఆయన వివరించారు. బరువు తగ్గడం అనేది 90 శాతం వరకూ మనం తీసుకునే ఆహారంపై ఆధారపడిఉంటుందని అన్నారు.
మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా క్యాలరీలను తక్కువగా తీసుకోవడం ద్వారానే మనం బరువు తగ్గుతామని అన్నారు. రెస్టారెంట్లు తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం అందించేందుకు ఆసక్తి చూపవని, ఆహారం రుచిగా ఉండేందుకు కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా వాడతారని చెప్పారు. కూరగాయలను సైతం అధిక నూనెలో వేయిస్తారని ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. మీరు ఇంట్లో ఒకసారి తీసుకునే భోజనంలో 600 నుంచి 700 క్యాలరీలు ఉంటే అదే రెస్టారెంట్లో ఒక మీల్లోనే 1200 నుంచి 1500 క్యాలరీలు ఉంటాయని మధు మీనన్ చెప్పుకొచ్చారు.
Read More