న్యూఢిల్లీ: ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎలక్షన్ కమిషనర్ల నియామకం, నిబంధనల బిల్లుపై మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా ఉండేదని, దాన్ని క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి తగ్గించేలా బిల్లులో పేర్కొనడం బాధాకరమని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినైనా ఎన్నికల కమిషర్గా నియమించే అవకాశముండేదని గుర్తుచేశారు. సెక్రటరీ స్థాయి అధికారులు లేదా ఆ హోదాతో సమాన హోదా కలిగిన వ్యక్తులనే ఎన్నికల కమిషనర్గా నియమించాలంటూ బిల్లులో ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామమని వెల్లడించారు.