గువహటి : రైల్వే ట్రాక్స్ను దాటుతూ ఏనుగులు ఎలా గాయపడుతుంటాయనే వీడియోలు (Viral video) సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఏనుగుల గుంపును గమనించి లోకో పైలట్స్ బ్రేకులు వేస్తున్నా అప్పటికే సమయం మించిపోవడంతో ఏనుగులను ఆ ప్రయత్నాలు కాపాడలేకపోతుంటాయి. రైల్వే ట్రాకుల వద్ద వివిధ ప్రాంతాల్లో క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పూనుకుంటున్నారు.
ఇక అసోం అటవీ శాఖ ఏనుగులు సురక్షితంగా రైల్వే ట్రాకులను క్రాస్ చేసేందుకు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో రీషేర్ చేసిన వీడియో జంతు ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఏనుగులు సులభంగా, సురక్షితంగా రైల్వే ట్రాక్స్ను దాటేందుకు అధికారులు ర్యాంప్ను ఏర్పాటు చేయడం చూడొచ్చు.
An effective way to reduce elephant deaths on Railway tracks. Ramp for the gentle giants to cross the tracks is a much simpler way to reduce the conflict.
Source:Assam FD pic.twitter.com/VZfwPjfwHG— Susanta Nanda (@susantananda3) May 31, 2023
ఏనుగుల గుంపు రాణి రిజర్వ్ ఫారెస్ట్ను చేరుకునేందుకు డీపర్ బీల్ నుంచి మికిర్పర కారిడార్ను దాటుతున్నాయని ఒరిజినల్ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. రైల్వే ట్రాకులపై ఏనుగుల మరణాలను తగ్గించేందుకు సమర్ధవంతమైన ఏర్పాటని సుశాంత నంద ఈ పోస్ట్కు క్యాప్షన్ను జోడించారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. ఏనుగుల భద్రత కోసం అటవీ అధికారులు చేసిన ఏర్పాట్లను నెటిజన్లు ప్రశంసించారు. ఏనుగులు నిత్యం ఉపయోగించే మార్గాలను గ్రీన్ కారిడార్గా ప్రకటించాలని మరికొందరు యూజర్లు సూచించారు.
Read More