న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది. (Air India fined) ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు ఈ మేరకు పెనాల్టీ విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్డీటీఎల్), ఫాటిగూ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్) నిబంధనలను ఎయిర్ ఇండియా ఉల్లంఘించినట్లు జనవరి నాటి ఆడిట్లో తేలింది.
కాగా, విమాన పైలట్లు, సిబ్బందికి తగినంత వీక్లీ రెస్ట్ లేకపోవడం, సుదూర ప్రయాణాలకు ముందు వారికి తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం వంటి అనేక ఉల్లంఘనలను ఆ ఆడిట్లో డీజీసీఏ గుర్తించింది. అలాగే పైలట్ల విధి వ్యవధిని మించిన సందర్భాలను రికార్డుల్లో తప్పుగా పేర్కొనడాన్ని గమనించింది. ఇలాంటి ఉల్లంఘనల వల్ల విమానాల భద్రతతోపాటు ప్రయాణీకుల శ్రేయస్సుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని డీజీసీఏ భావించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల జరిమానా విధించింది.