Tamilanadu | తమిళనాడు (Tamil Nadu)లో విషాదం చోటు చేసుకుంది. చెన్నై శివారులోని కీల్కట్టలై (Keelkattalai) సమీపంలోగల మూవరసంపేట ట్యాంక్ (Moovarasampet tank)లో పడి బుధవారం ఉదయం ఐదుగురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మలింగేశ్వరర్ ఆలయంలో (Dharmalingeshwarar temple) తీర్థవర్థి ఉత్సవాల్లో (Theerthavari festival ) ఈ విషాదం చోటుచేసుకుంది.
18 నుంచి 23 ఏండ్ల వయసున్న ఐదుగురు యువకులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పలవంతంగల్ పోలీసులు (Palavanthangal police).. అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్పేట ప్రభుత్వ ఆసుపత్రికి (Chromepet Hospital) తరలించారు. మృతులు మడిపాక్కంకు చెందిన రాఘవన్, కీల్కట్టలైకి చెందిన యోగేశ్వరన్, నంగనల్లూరుకు చెందిన వనేష్, రాఘవన్, ఆర్.సూర్యగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Rupert Murdoch | నిశ్చితార్థం రద్దు చేసుకున్న వృద్ధ ప్రేమికులు.. కారణం ఏంటంటే..?
Mrunal Thakur | నువ్వు మా సీతవు కాదు.. మృణాల్పై మండిపడుతున్న నెటిజన్లు..!