పంజాబ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ను కూడా మట్టికరిపించింది. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచన అభ్యర్ధులందరిలోకీ పెద్దవాడు. ఇప్పటి వరకు 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన బాదల్ను ఆప్కు చెందిన గుర్మీత్ సింగ్ ఖుడియన్ ఓడించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 1969 నుంచి ఎన్నికల్లో బాదల్ ఓడిపోవడం ఇప్పటి వరకూ జరగలేదు. ఇదే ఆయనకు తొలి ఓటమి.
పంజాబ్లోని లంబి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కాగా, పంజాబ్లో ఆప్ అభ్యర్థులు విజయ భేరి మోగించడంతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, ప్రకాశ్ సింగ్ బాదల్ తనయుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆప్కు, ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్కు అభినందనలు తెలిపారు.