Kalaburagi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలబురగి (Kalaburagi) జిల్లాలో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గాయాలపాలయ్యారు.
కలబురగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జిల్లాలోని నెలోగి క్రాస్ (Nelogi Cross) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న కలబురగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కలబురగి ఆసుపత్రికి తరలించారు. మృతులను బాగల్కోట్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై నెలోగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు కలబురగి పోలీసులు తెలిపారు.
Also Read..
“Myanmar | 3,000 దాటిన మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య.. ప్రకటించిన సైన్యం”
Ottawa | కెనడాలో భారతీయుడి దారుణ హత్య
Earthquake | పపువా న్యూ గునియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ