Uttarakhand | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని గ్రేటర్ నోయిడాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ప్రెస్వే వద్ద ఓ వ్యాన్ అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.