ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వస్తున్న కారు షీలత్నే వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని, అప్పటికీ ఆగకుండా రోడ్డు అవతలి వైపు ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందికి దూసుకెళ్లిందని చెప్పారు. దీంతో కారు నుజ్జునుజ్జు అయిందని, అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.