లక్నో : యమునా నదిలో డాల్పిన్ను పట్టుకున్న నలుగురు యూపీ మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుల్లో ఒకరైన మత్స్యకారుడిని అరెస్ట్ చేశారు. చైల్ ఫారెస్ట్ రేంజర్ రవీంద్ర కుమార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 22న నసీర్పూర్కు చెందిన నలుగురు మత్స్యకారులు యమునా నదిలో చేపల వేటకు వెళ్లగా వలలో డాల్ఫిన్ పట్టుబడింది. నదిలో దొరికిన డాల్ఫిన్ను వారు తమ భుజాలపై ఇంటికి మోసుకువచ్చి ఆపై దాన్ని వండుకుని తిన్నారు.
డాల్పిన్ను మత్స్యకారులు తీసుకువెళుతుండగా అటుగా వెళుతున్న వ్యక్తి కెమెరాలో రికార్డు చేశారని పిప్రి ఎస్హెచ్ఓ శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. మత్స్యకారులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.
Read More :