చల్లకెరె: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘుమూర్తి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిల్ కుమార్పై 16,127 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రఘుమూర్తి చల్లకేరి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పుడు వరుసగా రెండోసారి ఆయన తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
కాగా, ఇవాళ్టి లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కు మించిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. చల్లకెరె నుంచి రఘుమూర్తి గెలువగా మరో రెండు నియోజవర్గాలు కూడా కాంగ్రెస్ సొంతమయ్యాయి. హిరియూర్ నుంచి సుధాకర్, మొలకల్మూరు నుంచి గోపాలకృష్ణ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, లీడింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బెంగళూరులోని ఓ రిసార్ట్కు రప్పిస్తున్నది.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్