లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు హతమయ్యారు. మృతుల్లో ఒకరు గ్యాంగ్స్టర్ అన్షు దీక్షిత్. కాల్పులు ఎలా జరిగాయన్న దానిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారులను నివేదిక కోరారు.
చిత్రకూట్ జైలులో ఖైదీల మధ్య శుక్రవారం కాల్పులు జరిగాయి. ఇందులో వెస్ట్రన్ యూపీ గ్యాంగ్ స్టర్ అన్షు దీక్షిత్ ముక్తార్ అన్సారీ అనుచరులు మెరాజ్.. ముకిమ్ కాలాను కాల్చి చంపాడు. మేరాజ్ను బనారస్ జైలు నుంచి, ముకిమ్ కాలాను సహారాన్పూర్ జైలు నుంచి చిత్రకూట్ జైలుకు తీసుకొచ్చారు.
కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసు బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు లొంగిపోవాలని అన్షుల్ దీక్షిత్ను కోరినప్పటికీ అతను కాల్పులు కొనసాగించగా.. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరుపడంతో అన్షూ దీక్షిత చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు ఘటన తెలువగానే జైలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇంఛార్జీ పీఎన్ పాండే చిత్రకూట్ జైలుకు చేరుకున్నాడు. కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని ఆరా తీశారు. చిత్రకూట్ జైలులో కాల్పులు జరిగిన ఘటనపై సమగ్ర నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. 6 గంటల్లోనే కమిషనర్ డీకే సింగ్, డీఐజీ సత్యనారాయణ, ఏడీజీ (జైలు) సంజీవ్ త్రిపాఠి ఈ కేసును దర్యాప్తు చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని యోగి ఆదేశించారు.
గూగుల్తో జతకట్టిన ఎలోన్ మస్క్ ‘స్టార్లింక్’
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
కరోనాతో విలవిల.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..