న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను ఆర్పేందుకు ఘటనా స్ధలానికి 24 అగ్నిమాపక యంత్రాలను తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తోంది. మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 544 వద్ద అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.