న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని హర్కేశ్ నగర్లో ఉన్న ఓ ఫ్యాబ్రిక్ గోదామ్లో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం విస్తరించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 18 ఫైర్ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.