Fire Accident | ఓ కాటన్ గోడౌన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర భీవండి ప్రాంతంలోని ఓవాలిలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ విషయాన్ని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ యాసిన్ తాడ్వి ధ్రువీకరించారు. పరస్నాథ్ కాంపౌండ్ రాత్రి సమయంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత సమాచారం అందడంతో రెండు అగ్నిమాపక యంత్రాలను మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సంఘటనా స్థలంలో మోహరించారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.