పుణె: బీహార్లోని పుణలో ఉన్న ప్రముఖ గ్రాసరీ స్టోర్ గోదామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని బవ్ధాన్ బద్రుక్ ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్కెట్ గోదామ్లో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నగదుతోపాటు గోదామ్లో నిల్వ ఉంచిన కూరగాయలు, పప్పు దినులు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 60 మంది సిబ్బంది 12 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.
కాగా, అగ్నిప్రమాదంలో సుమారు రూ.90 లక్షల విలువైన సరుకు కాలిబూడిదయిందని గోదామ్ నిర్వాహకులు తెలిపారు. దీంతోపాటు గల్లాపెట్టెలో ఉన్న రూ.2 లక్షలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. వ్యాలెట్లో మొత్తం రూ.8 లక్షలు ఉన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదం ఎవరి ఎలాంటి హానీ జరగలేదని, అందులోపనిచేస్తున్న ఉద్యోగులంతా క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు.