న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మద్యాహ్నం నాలుగంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడటంతో స్ధానికుల్లో భయాందోళన నెలకొంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి.
భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకూ భవనం నుంచి 12 మందిని కాపాడామని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరిగిన సమాచారం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అయితే భవనంలో మంటలు ఎగిసిపడుతుండటం, దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో భవనంలో ఎంతమంది చిక్కుకుపోయారనే సమాచారం వెల్లడికాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.