ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున రెండు అంతస్తుల బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతిచెందారు. మంటల్లో ఇద్దరు మహిళలు కూడా కాలిపోయారు. ప్రమాదంలో చిక్కుకున్న 9 మందిని రక్షించారు. దాంట్లో అయిదుగుర్ని ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్ బేస్మెంట్లో ఉన్న విద్యుత్తు బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ప్రమాదం జరిగిన బిల్డింగ్.. ఇండోర్లోని స్వర్ణ భాగ్ కాలనీలో ఉంది. తెల్లవారుజామున 3.10 నిమిషాలకు ప్రమాదం జరిగింది. బిల్డింగ్లో ఉన్న టూవీలర్ వాహనాలకు పాకడంతో అవన్నీ బూడిదయ్యాయి. బిల్డింగ్ ఓనర్ అన్సర్ పటేల్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.