Kumara Swamy | కేంద్ర మంత్రి (Union Minister), జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి (HD Kumaraswamy)పై ఎఫ్ఐఆర్ నమోదైంది (FIR registered). ఏడీజీపీ ఎం.చంద్రశేఖర్ (ADGP M Chandrashekar) ఫిర్యాదు మేరకు కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కుమార స్వామి నిందితుడుగా ఉన్న మైనింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను నేతృత్వం వహిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. మైనింగ్ కేసులో విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు తనను కుమార స్వామి, ఆయన కుమారుడు నిఖిల్ బెదిరించారని ఏడీజీపీ చంద్రశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడీజీపీ ఫిర్యాదు మేరకు సంజయ్ నగర్ పోలీసులు కుమారస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా, 2006 నుంచి 2008 వరకు కుమార స్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన చట్టాన్ని ఉల్లంఘించి బళ్లారి జిల్లాలోని శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్కి 550 ఎకరాల మైనింగ్ లీజుకు అక్రమంగా ఆమోదించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరుగుతోంది.
FIR registered against Union Minister and JDS leader HD Kumaraswamy following a complaint by ADGP M Chandrashekar.
The ADGP had alleged that H.D. Kumaraswamy and his son Nikhil had made allegations against him to intimidate him and obstruct an investigation into a mining scam…
— ANI (@ANI) November 5, 2024
Also Read..
Unstoppable | జ్యోతిక లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. అన్స్టాపబుల్ షోలో సూర్య ఎమోషనల్
Virat Kohli | విరాట్ కోహ్లీ బర్త్డే.. సాగర తీరంలో ఆకట్టుకుంటున్న సైకతశిల్పం.. VIDEO