న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తగ్గించడంతోపాటు పెట్టుబడిదారులకు రక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో మార్పులు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆర్థిక రంగంలో సంస్కరణలు, టెక్నాలజీ పరంగా సమ్మళిత వృద్ధి, నాణ్యమైన, అత్యంత వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.