న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24ను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బహీఖాతా ట్యాబ్లెట్తో .. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కృష్ణారావ్ కరడ్, ఆర్ధిక శాఖ అధికారులు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఎరుపు రంగు బహీఖాతాతో మంత్రి కనిపించారు.
Union Minister of Finance and Corporate Affairs Smt Nirmala Sitharaman, MoS Dr Bhagwat Kishanrao Karad, MoS Shri Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget 2023-24. pic.twitter.com/Nun9hhaVyi
— President of India (@rashtrapatibhvn) February 1, 2023
అయిదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ట్యాబ్లెట్లో ఆమె బడ్జెట్ను చదువుతారు. ఇది పేపర్లెస్ బడ్జెట్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతి ముర్మును కలిసిన మంత్రి నిర్మల.. బడ్జెట్పై ఆమెకు సమాచారం అందజేశారు. బడ్జెట్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా దక్కనున్నది. ఉదయం 11 గంటలకు లోక్సభలో మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెడుతారు.
బడ్జెట్ వేళ సాంప్రదాయ ఎరుపు రంగు చీరను మంత్రి నిర్మల ధరించారు. బ్లాక్ బార్డర్ ఉన్న ఆ చీరలో .. నక్షత్రం డిజైన్ కూడా ఉంది. రాష్ట్రపతి ముర్మును కలిసిన తర్వాత ఆమె పార్లమెంట్కు చేరుకున్నారు.