న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను నెలకొల్పనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దేశంలో మొత్తం 700 జిల్లాలున్నాయని, వీటన్నింటిలో ఈ హాస్టల్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే వెటర్నరీ కాలేజీలు, దవాఖానలు, వ్యాధి నిర్ధారణ ల్యాబొరేటరీలకు రుణ అనుసంధాన మూలధన సబ్సిడీ మద్దతు పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు.
ఆయుర్వేద ఫార్మసీలు, డ్రగ్ పరీక్ష ల్యాబ్లు, గుజరాత్, జామ్నగర్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్రం సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ఉన్నతీకరిస్తామన్నారు.