న్యూఢిల్లీ, జనవరి 21: తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 రామాలయాలతో పాటు మిగిలిన దేవాలయాలలో అన్నదానం, పూజా కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్ఆర్ అండ్ సీఈ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని ఓ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ ఆరోపించారు. కేంద్ర మంత్రి ఆరోపణలను స్టాలిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శేఖర్ అన్నారు.