కోటా: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ ఆఖరి ఏడాది విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూమ్లో బలన్మరణానికి పాల్పడినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన నూర్ మహ్మద్ (27) కోటాలో 2016 నుంచి 2019 వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్కు కోచింగ్ తీసుకున్నాడు.
తర్వాత చెన్నైలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పటికీ విజ్ఞాన్ నగర్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ ఆన్లైన్ ద్వారానే తరగతులకు హాజరవుతున్నాడు.