లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు వారీ భవితవ్యం తేల్చనున్నారు.
ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈ విడుతలోనే పోలింగ్ జరుగుతున్నది. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 36 స్థానాల్లో విజయం సాధించగా, ఎస్పీ 11, బీఎస్పీ 6 చొప్పున గెలుపొందాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.