న్యూఢిల్లీ, మార్చి 28: రెండో విడతలో భాగంగా 12 రాష్ర్టాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎ న్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ 88 సీట్లకు ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 4 ఆఖరు తేది. జమ్ము కశ్మీర్లో ఏప్రి ల్ 6న, మిగతా అన్ని స్థానాల్లో ఏప్రిల్ 5న స్క్రూటినీ జరగనుంది. అవుటర్ మణిపూర్ స్థానంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.