Parliament | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక.
దాదాపు వందేండ్లుగా శాసనాలు రూపొందిస్తూ పాలనకు ఆలవాలంగా నిలుస్తున్న ఈ పార్లమెంట్ భవనం స్థానంలో కొత్త భవనం రూపుదిద్దుకొన్నది. కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్వరలో నూతన భవనంలోకి పార్లమెంట్ మారే నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పాతభవనంపై పడింది.