Leopard | దీపావళి (Deepavali).. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. ఈ వెలుగుల పండుగను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆదివారం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇంట్లో దీపాలు వెలిగించి, రాత్రి బాణాసంచా కాల్చి కుటుంబమంతా కలిసి సరదాగా గడిపారు. కాగా, ఈ వెలుగుల పండుగ రోజున తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
టపాసుల శబ్దానికి భయపడిన ఓ చిరుతపులి (Leopard) ఇంట్లోకి చొరబడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. నీలగిరి జిల్లా (Nilgiri distric)లోని కూనూర్లోగల బ్రూక్ల్యాండ్స్ ప్రాంతం (Coonoor Brooklands area) లో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. దాదాపు 15 గంటల పాటు ఆ ఇంట్లో ఉండిపోయింది.
సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులిపై నిఘా ఉంచేందుకు మూడు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా చిరుత కదలికలను నిరంతరం గమనించారు. ఆదివారం రాత్రి సమయంలో అది ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ముదుమలై టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ వెల్లడించారు.
#WATCH | Tamil Nadu: A leopard entered a house in the Coonoor’s Brooklands area, in Nilgiri, yesterday morning and attacked 6 people. The leopard stayed for more than 15 hours inside the house and escaped late on Sunday. https://t.co/LiQq4fk599 pic.twitter.com/4x5REMaKv6
— ANI (@ANI) November 13, 2023
Also Read..
Silent Diwali | అక్కడ 22 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఏడు గ్రామాలు
helicopter | సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు అమెరికా సైనికులు మృతి