న్యూఢిల్లీ : ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కు అనిల్ కుర్మాచలం శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.