న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలు పతాకస్ధాయికి చేరాయి. రైతుల నిరసనలు చేపట్టి ఏడాది పూర్తవడంతో ఆందోళనలను ముమ్మరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 26న 500 మంది రైతులు తమ ట్రాక్టర్లు, ట్రాలీలతో పార్లమెంట్ వైపు తరలివెళ్లాలని మంగళవారం జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో రైతు సంఘాల నేతలు తీర్మానించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు ఏడాది కాలంగా కొనసాగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని రైతు నేతలు పిలుపు ఇచ్చారు.