లక్నో: రైతులు మరోసారి తమ నిరసనను ఉధృతం చేశారు. (Farmers’ Protest) ర్యాలీగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ప్రాజెక్టుల కోసం తమ నుంచి సేకరించి అభివృద్ధి చేసిన అబాడీ ప్లాట్లలో పది శాతం లేదా వాటికి సమానమైన పరిహారం ఇవ్వాలని రైతులు 2019 నుంచి డిమాండ్ చేస్తున్నారు. 2020లో నోయిడా అథారిటీ కార్యాలయం వద్ద బైఠాయించి చాలా రోజులు నిరసన తెలిపారు. దీంతో 2023 డిసెంబర్లో గ్రేటర్ నోయిడా అథారిటీ దిగి వచ్చింది. అభివృద్ధి చేసిన భూమిలో 10 శాతం రెసిడెన్షియల్ ప్లాట్లు రైతులకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాగా, ఈ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ రైతులు మరోసారి నిరసన బాటపట్టారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, నోయిడా చిల్లా సరిహద్దు నుంచి పార్లమెంట్కు పాదయాత్ర తలపెట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గురువారం నోయిడా సెక్టార్ 24 లోని ఎన్టీపీసీ కార్యాలయం, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.
మరోవైపు అక్కడి నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా పోలీసులను మోహరించడంతోపాటు భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీకి వెళ్లే అన్ని సరిహద్దులను మూసివేశారు. నిరసన ర్యాలీ విరమించేందుకు రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
#WATCH | UP farmers marching towards Parliament stopped by police in Noida
The farmers are protesting over their various demands including hiked compensation pic.twitter.com/fwdQ2mVM4R
— ANI (@ANI) February 8, 2024
तीन बड़ी खबर-
1. दिल्ली कूच के लिए आ रहे किसानों को नोएडा में रोका, दिल्ली के सारे बॉर्डर सील
2. हरियाणा में भाजपा अकेले लड़ सकती है चुनाव, JJP से कुट्टी
3. आम आदमी पार्टी ने थक हार कर असम में उतारे तीन उम्मीदवार#FarmersProtest #HaryanaBJP #AAP pic.twitter.com/o1USfZEwUe
— Nirmal Pareek (@nirmal_pareek93) February 8, 2024