Farmers Protest | లూధియానా: రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహా పంచాయత్ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది.
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు చట్టాన్ని ఆమోదించడంతోపాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీనిని నిర్వహిస్తున్నట్లు వివరించింది. 37 రైతు సంఘాలు శనివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.