Farmers Protest | రైతుల ఢిల్లీ చలో నిరసన కార్యక్రమంపై పంజాబ్-హర్యానా హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది. నిరసనలో ట్రాక్టర్ ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటే ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అదే సమయంలో రైతులను గుమిగూడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలకు సంబంధించిన ఫలితం, స్టేటస్ రిపోర్టును తదుపరి విచారణ సమయంలో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్రమంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య గురువారం మరోసారి సమావేశం ఏర్పాటు చేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ హైకోర్టుకు తెలిపారు. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రతివాదులందరూ స్టేటస్ రిపోర్ట్తో హాజరుకావాలని ఆదేశించింది.