న్యూఢిల్లీ, నవంబర్ 29: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధమైన హామీ, నిరసనల్లో మరణించిన రైతులకు పరిహారం, అన్నదాతలపై కేసుల ఎత్తివేత వంటి ఆరు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పంజాబ్కు చెందిన 32 రైతు సంఘా ల నేతలు సోమవారం డిమాండ్ చేశారు. మంగళవారం నాటికి సమాధానం చెప్పకపోతే, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై బుధవారం భేటీ కానున్నట్టు తెలిపారు.
4 లక్షల ట్రాక్టర్లు సిద్ధం: టికాయిత్
ఎంఎస్పీపై హామీనిచ్చే చట్టాన్ని తీసుకురావాలని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని, ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నా రు. ముంబైలో ఆదివారం మహా పంచాయత్లో ఆయన మాట్లాడారు. టికాయిత్ హెచ్చరికల నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతు నేతలతో ఢిల్లీ పోలీసులు సమావేశమయ్యారు.