ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకు సరైన పరిష్కారాన్ని చూపగలిగినవాడే గొప్పోడు. ఐడియాలు అందరికీ వస్తాయి. కానీ.. వాటిని ఆచరణలో పెట్టేవాళ్లు ఎందరు. కొందరు మాత్రమే తమ అవసరానికి తగ్గట్టుగా ఆలోచిస్తుంటారు. వాటిని సుసాధ్యం చేస్తుంటారు. తాజాగా ఓ రైతు అదే చేశాడు. కేరళలోని మించినాక అనే ఓ చిన్న గ్రామంలో వరదా అనే నదిని దాటేందుకు ఓ రైతు చేసిన ఆలోచనకు ఇప్పుడు అందరూ సలామ్ కొడుతున్నారు.
ఆయనే కృష్ణ భట్. ఆయనకు ఈ నదికి అవతలి వైపు.. ఇవతలి వైపు మూడున్నర ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆ స్థలంలో పలురకాల చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లతో పాటు పామాయిల్ చెట్లు కూడా ఉన్నాయి. అయితే… అటూ ఇటూ నదిని దాటడమే కృష్ణకు గగనంగా మారిపోతోంది. దాని కోసం కృష్ణ భట్ ఒక చిన్న బ్రిడ్జిని నిర్మించాడు. దాని కోసం సంవత్సరానికి 10 వేల రూపాయలు వెచ్చించాలి. అయినప్పటికీ ప్రతి వర్షాకాలం అది వాననీటిలో మునిగిపోతుంది. దీంతో నది దాటడం వాళ్లకు కష్టంగా మారుతోంది.
దానికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని అనుకున్న కృష్ణ కొడుకు భీమేశ్.. ఆ నదిని దాటేందుకు రోప్ వే అయితే బెటర్ అనుకున్నాడు. దీంతో సునీల్ అనే ఓ ప్రొఫెసర్ సాయంతో వరదా నదికి అడ్డంగా ఒక పెద్ద బాస్కెట్తో రోప్వేను నిర్మించారు. ఆ బాస్కెట్లో కూర్చొని రోప్వే సాయంతో నదిని అవలీలగా దాటేయొచ్చు. దాని కోసం భట్ ఫ్యామిలీకి మరో 60 వేల ఖర్చు అయినప్పటికీ అది వాళ్లకు రోడ్డు దాటడానికి శాశ్వత పరిష్కారం చూపింది.
ఆ రోప్వేను గ్రామస్థులు కూడా ఉపయోగించుకుంటున్నారు. వర్షాకాలం వచ్చినా ఆ రోప్వే సాయంలో నదిని ఈజీగా దాటగలుగుతున్నారు. నదిని సులభంగా దాటేలా రోప్వే నిర్మించిన భట్ ఫ్యామిలీకి ఆ ఊరు ప్రజలు సలాం కొడుతున్నారు.