Tsunami Alert | దేశ, విదేశీ పర్యాటకులతో నిత్యం బిజీబిజీగా ఉండే గోవా (Goa) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాత్రి వేళ సునామీ వస్తుందన్న హెచ్చరిక (Tsunami Alert )తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
గోవా రాజధాని పణాజీ (Panaji) సమీపంలోని పోర్వోరిమ్ (Porvorim) ప్రాంతంలో ఉన్న కొండపై సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను (Early Warning Dissemination System) ఏర్పాటు చేశారు. ఇది రాబోయే విపత్తును ముందే పసిగట్టి సైరన్ ద్వారా హెచ్చరిస్తుంది. అయితే, బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ఒక్కసారిగా సైరన్ మోగింది. దాదాపు 20 నిమిషాల పాటు సైరన్ మోత మోగుతూనే ఉంది. దీంతో గోవా ప్రజలు, పర్యాటకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు ఊహించని ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు సాంకేతిక సమస్య కారణంగా సైరన్ మోగినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై ఉత్తర గోవా (North Goa) జిల్లా కలెక్టర్ మము హెగే (Mamu Hage) స్పందించారు. సైరన్ మోగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిన వెంటనే దానిపై సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదని.. దీంతో టెక్నికల్ సమస్య కారణంగానే సైరన్ మోగినట్లు గుర్తించామని ఆమె తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Actor Sathyaraj | సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు.. మంత్రికి మద్దతు తెలిపిన కట్టప్ప
G20 Meeting: మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడకు ఆహ్వానం.. మల్లిఖార్జున్ ఖర్గేకు అందని ఆహ్వానం
Varanasi | కాశీ విశ్వనాథుడికి రికార్డు స్థాయిలో విరాళాలు.. శ్రావణ మాసంలోనే..!