ముంబై, అక్టోబర్ 24 : ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు హైదరాబాద్కు వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బెయిల్పై బయట ఉన్న వరవరరావు ముంబైని విడిచి వెళ్లవద్దంటూ కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. కంటి చూపు మందగించిందని, హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనుమతించాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. అందుకు అనుమతి తెలిపింది.