న్యూఢిల్లీ : నటి, బీజేపీ నేత సొనాలి పోగట్ అనుమానాస్పద మృతిపై పలు ఊహాగానాలు సాగుతుండగా తాజాగా ఆమె ఫాంహౌస్ నుంచి ఖరీదైన కార్లు, ఫర్నిచర్ అదృశ్యమైనట్టు తెలిసింది. సొనాలి పోగట్ ఆస్తిని చేజిక్కించుకోవాలని ఆమె హత్య కేసులో నిందితుడు సుధీర్ సంగ్వాన్ ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్నాడని హత్య కేసును దర్యాప్తు చేసిన గోవా పోలీసులు వెల్లడించిన తర్వాత ఫాంహౌస్లో విలువైన ఆస్తులు మాయం కావడం గమనార్హం.
సోనాలి ఆస్తులపై కన్నేసిన సంగ్వాన్ 20 ఏండ్ల లీజుపై ఆమె ఫాంహౌస్ను దక్కించుకోవాలని కుట్ర పన్నాడని గోవా పోలీసులు వెల్లడంచారు. మహీంద్ర స్కార్పియో సహా పలు వాహనాలు ఫాంహౌస్ నుంచి అదృశ్యమయ్యాయని సమాచారం. సొనాలి ఫోగట్ ఫాంహౌస్ విలువ రూ 110 కోట్లు ఉంటుందని అంచనా. ఏటా రూ 60,000 చెల్లించి 20 ఏండ్ల పాటు సొనాలి ఫాంహౌస్ను లీజుకు తీసుకోవాలని సొనాలి పీఏ సంగ్వాన్ స్కెచ్ వేశాడని తెలిసింది.
సొనాలీ పోగట్ మృతి కేసులో సంగ్వాన్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సొనాలి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు హిస్సార్లో ఆమె డైరీ లభించింది. డైరీలో పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తల నెంబర్లు ఉన్నాయని గుర్తించారు. డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు సొనాలి పోగట్ లాకర్ను కూడా సీజ్ చేశారు.