Excise Policy Case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ నిర్ణయాన్ని కోర్టు గురువారం వాయిదా వేసింది. పిటిషన్పై శుక్రవారం తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ పిటిషన్పై విచారణ జరిపి, ఇరువర్గాల వాదలను విని తీర్పును రిజర్వ్ చేశారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఆప్ ఎంపీపై అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేసింది. అక్టోబర్ 4న ఈడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్పై సంజయ్ సింగ్ తరఫున సీనియర్ న్యాయవాది మోహిత్ మాథూర్ వాదనలు వినిపించారు.
అరెస్టకు ముందు సంజయ్ సింగ్ను ఒక్కసారి కూడా విచారణకు పిలువలేదన్నారు. అప్రూవర్లుగా మారిన నిందితులు దినేశ్ అరోరా, చందన్రెడ్డి, ఇతర సాక్షుల వాంగ్మూలాల్లో అనేక వైరుధ్యాలున్నాయని కోర్టుకు తెలిపారు. దినేకు ఆల్ఫా అనే నకిలీ పేరుందని.. దినేశ్ అరోరా నిజం చెబుతున్నాడని ఎలా అనుకోవచ్చని ప్రశ్నించారు. ప్రతి వ్యాపార ఒప్పందంలో అవినీతి చూడలేమన్నారు. నేరం ద్వారా వచ్చే ఆదాయాలపై మాట్లాడేటప్పుడు కొంత డబ్బు ఉండాలన్నారు. ఈ సందర్భంలో డబ్బు మూలాలే లేవన్నారు. అయితే, ఈ కేసులో ఆధారాలకు సంబంధించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపించారు.