జైపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను సమైక్యం చేసేందుకు ‘భారత్ జోడో’ యాత్రను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టారు. కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతున్నది. సవాయి మాధోపురిలో బుధవారం తిరిగి ప్రారంభమైన ‘భారత్ జోడో’ యాత్రలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన నడిచారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. విద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. హమ్ హోంగే కామియాబ్ (మేం విజయం సాధిస్తాం) అని ఇది చెబుతోంది’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
అయితే బీజేపీ నేత అమిత్ మాల్వీయ దీనిపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఆర్బీఐ గవర్నర్గా నియమించిందని, అందుకే ఆయన రాహుల్ యాత్రలో పాల్గొన్నారని, ఇది ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానించారు.
#BharatJodoYatra में @RahulGandhi जी के साथ कदम मिलाते RBI के पूर्व गवर्नर श्री रघुराम राजन…
नफ़रत के खिलाफ देश जोड़ने के लिए खड़े होने वालों की बढ़ती संख्या बताती है कि- हम होंगे कामयाब। pic.twitter.com/MFV6izCpcw
— Congress (@INCIndia) December 14, 2022
Former Governor of RBI, Dr. Raghuram Rajan joined Rahul Gandhi in today’s #BharatJodoYatra pic.twitter.com/BQax4O0KSF
— Darshnii Reddy ✋🏻 (@angrybirddtweet) December 14, 2022