న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సిద్ధిఖీ భారత్లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని ఈడీ గుర్తించింది. ఆయన రూ.70 కోట్లకు పైగా మనీలాండరింగ్కు పాల్పడ్డాడని, దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 9న పీఎంఎల్ఏ చట్టం కింద చెన్నై, మధురై, తిరుచ్చిరాపల్లిలో జాఫర్, ఇతరులకు చెందిన ప్రాంగణాల్లో ఈడీ చెన్నై యూనిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ డ్రగ్ అక్రమ రవాణాలో సిద్ధిఖీ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని ఈడీ భావిస్తున్నది.