న్యూఢిల్లీ : ఎయిమ్స్-ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా మెదాంతలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఛైర్మన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా చేరారు. ఎయిమ్స్లో మూడు దశాబ్ధాలకు పైగా సేవలందించిన అనంతరం రణ్దీప్ గులేరియా స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారు.
ఎయిమ్స్లో 2011లో పల్మనరీ మెడిసిన్, స్లీప్ డిజార్డర్స్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటయ్యేలా డాక్టర్ రణ్దీప్ గులేరియా చొరవ తీసుకున్నారు. 2017ల మార్చి 8న అయిదేండ్ల పదవీ కాలానికి ఆయన ఎయిమ్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ గులేరియా పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
డబ్ల్యూహెచ్ఓలోని సాంకేతిక నిపుణుల సలహా కమిటీ సభ్యులుగానూ వ్యవహరించిన గులేరియా జామా, ఇండియన్ జర్నల్ ఆఫ్ చెస్ట్ డీసీజెస్, లంగ్ ఇండియా, చెస్ట్ ఇండియా వంటి ప్రముఖ జర్నల్స్కు చెందిన ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా పనిచేశారు. డాక్టర్ గులేరియ సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఆపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) చండీఘఢ్ నుంచి జనరల్ మెడిసిన్లో ఎండీ, పల్మనరీ మెడిసిన్లో పట్టా పొందారు.