శ్రీనగర్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అంటే చోరీ యంత్రాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. ఆయన ఆదివారం శ్రీనగర్ శివారులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేటపుడు ఈవీఎంలలోని ఎల్ఈడీ లైటును పరిశీలించి చూడాలని ఓటర్లను కోరారు. ఓటు వేసిన తర్వాత ఈవీఎం నుంచి బీప్ శబ్దం వస్తుందని, లైటు వెలుగుతుందని, ఆ లైటు వెలగకపోతే, వెంటనే పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించాలని చెప్పారు. “మీరు ఏ గుర్తుకు ఓటు వేస్తే ఆ గుర్తు వీవీప్యాట్ స్లిప్లో ముద్రితమవుతుంది. మీరు ఓటు వేసిన గుర్తు, వీవీప్యాట్ స్లిప్లో ముద్రితమైన గుర్తు ఒకటేనా, కాదా? పరిశీలించాలి’ అని చెప్పారు.