న్యూఢిల్లీ, జూలై 17: ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన ఓటు కౌంట్ అయినట్టుగా రికార్డు అయిందా? లేదా? అనేదాన్ని వీవీప్యాట్తో సరిచూసుకొనేలా ఓటర్కు వెసులుబాటు ఉండాలని ఏడీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నది. దీనిపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం త్రివేది ధర్మాసనం ఈసీకి సూచించింది. నోటీసులు ఇవ్వడం లేదని, స్పందన కోసం పిటిషన్ కాపీని ఈసీ న్యాయవాదికి అందించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపింది.