Etamatam | కర్ణాటకలో ఒకపక్క తాగునీరు, సాగునీరు, విద్యుత్తు కోసం ప్రజలు అల్లాడి పోతుంటే, ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభువులు మాత్రం, పని పాతర పెట్టి జాతరకు వెళ్లిందన్న నానుడిని గుర్తుకు తెచ్చే పనులు చేస్తున్నారు. ఎవరి మెడలో అయినా పులి గోర్లు ఉన్నాయా? ఎవరి ఇంట్లో అయినా పులిచర్మం మీద కూర్చొని పూజలు చేస్తున్నారా?… అని అటవీ, పోలీసు శాఖలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీలు నిష్పాక్షికంగా జరుగుతున్నాయని నమ్మించడానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో… ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నుంచి దృష్టిని పులిగోర్ల మీదికి మళ్ళించే ఆలోచన సక్సెస్ కావడంతో, సీఎం సిద్ధరామయ్య ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ రిలాక్స్ అవుతున్నారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
– సీఎస్వీ