Loksabha Elections 2024 : మైసూర్ రాజ కుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ బుధవారం మైసూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మైసూర్-కొడగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎం. లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు.
లక్ష్మణ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇక అంతకుముందు మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్(MP Sumalatha Ambareesh) బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు.దీంతో ఆమె రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూటమికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పేశారు.
మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు సుమలత తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్పై సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే.కేంద్రంలోని బీజేపీ సర్కారు మాండ్య లోక్సభ నియోజకవర్గానికి 4 వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసినట్లు సుమలత వెల్లడించారు. కాగా, బీజేపీ నుంచి రాజ్యసభకు సుమలత వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read More :
Vishweshwar Rao | హాస్యనటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత