న్యూఢిల్లీ: కొవిడ్ వారియర్స్కు తాజాగా బీమా పాలసీని అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద కొవిడ్ యోధులకు బీమా సెటిల్మెంట్లను ఈ నెల 24 లోగా పరిష్కరించి, ఆ తర్వాత కొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందుకోసం న్యూ ఇండియా అస్యూరెన్స్తో చర్చలు జరుపుతున్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీమా సంస్థ ఇప్పటివరకు 287 క్లెయిమ్లను చెల్లించింది.
‘కొవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడంలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషించింది. కరోనా యోధుల ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ బీమా పాలసీ సెటిల్మెంట్లు అన్నీ 2021 ఏప్రిల్ 24 వరకు పరిష్కరిస్తారు. అనంతరం కరోనా యోధుల కోసం తాజా బీమా పాలసీ అమలులోకి వస్తుంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నది. గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేపీని ప్రకటించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 24 వరకు మూడుసార్లు పొడిగించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనో యోధులకు కొవిడ్-19 రోగులకు చికిత్స అందించే సమయంలో ఏదైనా ప్రతికూలత ఎదురైతే.. వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకునేలా ఆరోగ్య కార్యకర్తలకు భద్రతా వలయాన్ని అందించడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రాణాలు కోల్పోయిన కరోనావైరస్ యోధులపై ఆధారపడినవారికి ఇది భద్రతను అందిస్తున్నది.
కేరళ వ్యక్తి చేతిలో జీవం పోసుకున్న బుల్లి మహీంద్ర జీపు
ఈ 8 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..!
మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి.. ఇవాళ వరల్డ్ లివర్ డే
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..