ఈ ఏడాది ఎండలు ఎక్కువే అని హెచ్చరిస్తున్నారు వాతావరణ పరిశోధకులు. కార్బన్ డయాక్సైడ్ వాయు ఉద్గారాలు వాతావరణంలో నిరంతరం పెరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 18 వ శతాబ్దం పారిశ్రామిక విప్లవానికి ముందు (దాదాపు 300 సంవత్సరాల క్రితం) కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు మానవ ఉత్పత్తి కార్బన్ ఉద్గారాల స్థాయి కంటే 50 శాతం అధికంగా ఈ సంవత్సరం చివరి నాటికి ఉంటాయని ఒక అధ్యయనంలో పరిశోధకులు నివేదించారు. అంటే కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 18 వ శతాబ్దం కంటే ఒకటిన్నర రెట్లు పెరుగుతాయన్నమాట.
ఇటీవలి అధ్యయనంలో, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ పరిశోధకులు హవాయి, మంచుతో నిండిన ప్రాంతాలకు సంబంధించిన కార్బన్ డయాక్సైడ్ డాటాను విశ్లేషించారు. 1750–1800లో కార్బన్ డయాక్సైడ్ సగటు స్థాయి మిలియన్కు 278 భాగాలు (పీపీఎం) అని కనుగొన్నారు.
అదే సమయంలో మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి 2021 మార్చిలో 417.14 పీపీఎంకు చేరుకున్నది. మే నాటికి కార్బన్ ఉద్గారాలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే, దీని సగటు 2021 లో 419.5 పీపీఎంకు చేరుకుంటుందని వారు చెప్తున్నారు.
1760 లో ప్రారంభమైన కార్బన్ డయాక్సైడ్ 2021 మార్చి నాటికి కొత్త స్థాయికి చేరుకున్నదని పరిశోధకులు తమ విశ్లేషణలో తేల్చారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మొత్తం 25 శాతం పెరుగడానికి 200 సంవత్సరాలు పట్టిందని లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సైమన్ లూయిస్ చెప్పారు. పారిశ్రామిక పూర్వ విప్లవ స్థాయి నుంచి కేవలం 30 సంవత్సరాల్లో 50 శాతానికి చేరుకున్నది. ఈ నాటకీయ మార్పు మానవ ఉల్క భూమి వంటిదని లూయిస్ అంటున్నారు.
మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి.. ఇవాళ వరల్డ్ లివర్ డే
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..