న్యూఢిల్లీ, జూలై 29: జాతి నిర్మాణం కోసం సాగుతున్న మహాయజ్ఞంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ యువతకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా.. స్థానిక భాషలోనే విద్యాబోధన చేయనున్నట్టు వెల్లడించారు. ఇంజినీరింగ్ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు పేర్కొన్నారు. యువత తమ కలలను సాకారం చేసుకోవడంలో ఈ కొత్త విధానం దోహదపడుతుందన్నారు. నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని ్రప్రారంభించిన విద్యా కార్యక్రమాలు